watch?v=ivxkJbL2oPkclick
ఆనందాలు అనేకరకాలు.
మనుష్యానందము.— మనంకోరినది సాధించినపుడు కలిగే ఆనందం.ఇది తాత్కాలికం.మళ్ళీకొత్తకోరిక మొదలవుతుంది.
ఋష్యానందం– ఒక మహాత్ముని దర్శించినపుడు కలిగే ఆనందం.ఇదీతాత్కాలికమే.
గంధర్వానందం—మంచిగానాన్ని,మంచినాదాన్ని విన్నపుడు కలిగే ఆనందం.ఇదీ తాత్కాలికమే.
దేవానందం—- దేవుళ్ళను,దేవాలయాలను దర్శించినపుడు కలిగేఆనందం.ఈ కలియుగములో ఇదీ కొంతకాలమే.
ప్రజాపత్యానందం— దేనినైనా సృస్టించినపుడు కలిగే ఆనందం.దక్షుడూ,మనువు లాటి వారు సాధించినవి.వారిఆనందం తపస్సువలన కలిగినది.అదీపరిపూర్ణమైనదికాదు.
మరిఏది పరిపూర్ణ అనందమూఅంటె, స్వాత్మానందము.
నిరంతర ధ్యానసమాధిలో భక్తుడు,భగవంతునికలిసిన నిశ్చలస్థితిలో కలిగే ఆనందమట.ఇది సర్వానందాల పరాకాష్ట.అలాటి ఆనందాన్ని అనుభవించిన అన్నమాచార్య కీర్తనాయోగము మనపాలి ఘన నిధానము.
అందుకే అన్నమాచార్య అంటారు
కామధేనువు,కల్పవృక్షమూ తనకు హరినామమే అని.
ఏపున శ్రీవేంకటేశుడె సర్వము
దాపై ఈతని వందనమే విధి
కాపుగ శరణాగతులే చుట్టాలు
పైపై గేలిచిన ప్రపన్నులకును అని”
ఓ సంకీర్తన వలన కలిగే సౌభాగ్యమది.భగవద్భక్తులనేకులు మన బంధువులవుతారు.మనకిక ఒంటరితనానికి తావేలేదు.ఆనందానికి అవధులులేవు.