ఓకపరికొకపరి ఒయ్యారమై
అక్టోబర్ 11, 2008
జగదానందకారకడు స్వామివారి ఆనందరూపాన్ని బ్రహ్మొత్సవాలలోచూసిన ప్పుడు అనిపించింది అన్నమాచర్యులవారు మధురమైనకీర్తనలనెలా వ్రాయగలిగారో.ప్రపంచంలోఎక్కడా ఇంతసుందరమైన దైవము లేడు.అన్నమయ్యది భక్తి భావాలతో కూడిన హృదయం.అందగానే స్పందించడంలో అతిశయమే లేదు.
నిరంతరము స్వామిసేవలో వున్న అన్నమయ్యకు స్వామిలో వివిధమైనఅందాలు కనిపించేవట.
ఒకపరికొకపరిఒయ్యారమై
మొగమునకళలెల్ల మొలచీనట్టుండె”
జగదేకపతిమేన జల్లినకర్పూరధూళి
జిగిగోని నలువంక జిందగాను
మొగిచంద్రముఖి వురమున నిలిపెగాన
పొగరు వెన్నెల ,దిగబోసినట్టుండె”
మెరయ శ్రీవేంకటేశు మేనసింగారముగాను
తరచయిన సొమ్ములు ధరియింపగా
మెరుగూబోణి అలమేలుమంగయుతాను
మెరుపుమేఘముగూడి మేరసీనట్టుండె”
స్వామిలో ఓకసారికి,మరిఒకసారికి కొత్తకళలు కనిపిస్తున్నాయట.
ఒకసారి నిలువున కర్పూరముతో పొగరువెన్నెల దిగబోసినట్ట్లుగావున్నాడట.
మరిఒకసారి,నిండు ఆభరణాలుధరియించిన అమ్మవారితోవున్న నల్లనిస్వామి మెరిసే మేఘములావున్నాడట.
చూసే కళ్ళకి ఆనందం కలిగితే,వినే మనసుకి ఆహ్లాదం కలిగించే కీర్తన.
జగన్మోహనాకారాన్ని మన హృదయములో నిలిపే భావన.
భగవత ప్రేమ భక్తికి లక్షణము.ఆప్రేమని అక్షర రూపములో చూపిన పదకవితాపితామహుడు అన్నమాచర్యులవారు .
http://www.youtube.com/watch?v=WvfvzKzYm3gwatch?v=WvfvzKzYm3g

Entry Filed under: Uncategorized. ట్యాగులు: annamayya.
Trackback this post | Subscribe to the comments via RSS Feed