మరి ఎందుగతిలేదు,మనుప నీవే దిక్కు[
జెరసి లక్శ్మీశ నీశరణమె దిక్కు"

భవసాగరంబులో పడిమునిగిన నాకు
తివిరి నీనామమనె తేపయెదిక్కు
చివికి కర్మంబనెడు చిచ్చు జొచ్చిన నాకు
జవళి ఆచార్యకృపాజలధి యె దిక్కు"

ధన మోహ పాశముల గాలికిపొయ్యెడినాకు
కొనలనీపాదచింతకోమ్మయేదిక్కు
తనలి మనసనెడి ఆకసమున నున్ననాకు
కనుగొనగ నీదాస్యగరుడడే దిక్కు"

మరిగి సంసారమనెడి మంతిలి గిందడి నాకు
ధరభక్తియను బిలద్వారమే దిక్కు
ఇరవైన శ్రి వేంకటేశ ఇన్నిటా నాకు
అరుదైన నీఅంతరాత్మమె దిక్కు

ఇహ సంసారె బహుదుస్తారె
కృపయా పారె పాహి మురారె"

శంకరాచార్య వ్రాసిన భజగోవిందములోని  ఈపదాలకి, అన్నమచార్యకీర్తనలోని భావానికి  చాలా పోలిక కనిపిస్తుంది.కారణజన్ములయిన మహాత్ములందరి భోధలు అన్నీ ఒకేరకంగా వుంటాయి అనడానికీ ఇది ఒక నిదర్శనం.

కష్టభరితమైన ఈ సంసారాన్ని దయతో గట్టేక్కించమని శంకరాచార్య ఈస్లోకంలో చేబితే
మరి ఎందు గతి లేదు మనుపనీవె దిక్కు" అన్నారు అన్నమాచార్య.

ఇంగ్లిషులో వ్యాఖ్యానముతో ,యమ్.యస్.గారి ఖంఠములో భావయుక్తంగా పలికిన భజగోవిన్దం వినవలసిన  జీవనసత్యం.