ఆత్మ నివేదన
సర్వ సాక్షివి నీవుసర్వాంతరంగుడవు
సర్వంసహాచక్రవర్తి నిర్వాణమూర్తి
నిగమాంత కీర్తి సర్వాపరాధములు క్షమియింపవే”
మనసులోని భాధలు భయాలు భగవంతుని పాదాలకు సమర్పించితే
కలిగే మనోబలం మనచుట్టూ వందలాది మనుషులున్నాకలుగుతుందా
భగవంతునిపై వున్న విశ్వాసం కలిగించే శక్తి మరే ఆయుధానికైనావున్నదా
మనిషికి స్థిత ప్రగ్న్యత కలిగించె ఒకే ఒక ప్రక్రియ నిర్మలముగా సాగే మానసిక నివేదన.అదేప్రార్ధన.
హరి అంటేనెసర్వపాపాలను హరించేవాఆఆడు.ఆమహనీయుడు స్థవనీయుడు ఆరాధనీయుడు.శాంతిని ప్రసాదించె కాంతికిరణాలకు నిలయం హరినామం.
ఆమహనీయునిదర్శించడానికి నిర్మల హ్రుదయముతో ఆత్మనివేదన చేసుకోవడమే వుత్తమమార్గము
అన్నమాచార్యులవారి సాధనామార్గమే మనకూ ఆచరణీయము.
జనన మరణాలను తెలుసుకోలెను నాలోని మంచి చెడులను తెలుసుకోలేను నిన్ను తెలుసుకోవడం నాకుసాధ్యమా.నిన్నువిడువలేను జగద్రక్షకుడవు నన్నునాజీవితంకడవరకు రక్షించు స్వామి అనే ఆత్మనివేదన ఈకీర్తన
దీనుడనేను దేవుడవు నీవు
నీ నిజ మహిమే నెరపుట గాక
మతి జననమెరుగ మరణంబెరుగను
ఇతవుగనినునిక ఎరిగేనా
క్షితి పుట్టింఛింన శ్రీపతివి నీవు
తతినాపైదయ తలతువు గాక
తడవనాహేయము తడవ నా మలినము
తడయక నీమేలు తలచేనా
విడువలేని శ్రీ వేంకట విభుడవు
కడదాకా నను కాతువుగాక
ఒకసారి ఆపాదాలను ఆశ్రయించించిన భక్తుడు ఆపాదాలు విడిచి మనగలడా.
నాకన్నీ నీవే అన్నఏ భక్తుని ఆయనకాదన్నాడు.శరణాగతిని మించిన భక్తి మార్గము మరిఒకటిలేదు.
అన్నమయ్య జీవితమే ఒకధీర్ఘ శరణాగతి
విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం
అహ మిహ తవ పద దాస్యం అనిశం భజామి.
అన్నమయ్య జయంతి సుభాశీశులతో
అన్నమయ్య ఆరాధనలో
లక్ష్మి పున్నమ్మ
.