“విజయ విమల వంద్య వందారు జనవత్శల
వాగ్వాదిని వామకేశి వహ్నిమండలవాశిని”
లలితాసహస్రములోని శ్లోకము
పద్ముడనేరాక్షసుని సంహరించి,”విజయఅపరాజిత” అని దేవతలచేస్తుతింపబడినది.కాలవిభజనచేసే కాలస్వరూపిణి విజయ.
విజయముహుర్త రహస్యము ఒకటున్నది.
సాధారణంగా ఎక్కడపోటీజరిగినా కొందరు గేలుస్తారు,కొందరు ఓడిపోతూవుంటారు.
పోటీజరిగేసమయములో అందరూఇదిగోవీరు గేలుస్తారు అని అనుకోనే అంతలో మరేవరో విజయాన్ని చేజిక్కించుకుంటారు.అదేమి విచిత్రమో,ఇదెలా జరిగింది అనుకొనేలోపల జరిగిపోతుంది.”క్షణకాలం”అనే ముహుర్తమే విజయముహుర్తం.రెప్పపాటులో గేలవనూవచ్చు,ఓడనూవచ్చు.
అదే విజయముహుర్త రహస్యము.ఆక్షణకాలము అమ్మవారి గుప్పిట వుంటుది.ఆక్షణాన్ని చేజిక్కించుకోవాలంటె అమ్మవారికరుణాకటాక్షాలుండాలి.ఆకరుణను దక్కించుకోడానికికూడా భక్తుడు తన అంతరంగాన్ని నిర్మలంగావుంచుకోవాలి.
“కమలే కమలాక్ష వల్లభే
త్వంకరుణాపూర తరంగితై రపాంగై
అవలోకయమాం, అకించనానాం
ప్రథమంపాత్ర మకృత్రిమం దయాయాహ”
కనకధారా స్తోత్రములోని శ్లోకము.
అమ్మా నీకరుణాతరంగిత దృక్కులు నాపై ఓక్కసారి ప్రసరించు తల్లీ అని ఆర్తితో అడగాలి.
అమ్మాఅనిఅడిగితే జగన్మాత కాదని అనగలదా.అరవైనాలుగు కోట్ల యోగిని గణాలు అమ్మవారి చుట్టు పరిచర్యలు చేస్తూవుంటారట.వేయి పూజలు,వేయిస్తొత్రాలు,వేయినామజపాలు అన్నటి ధ్యేయమూఒకటే.
నిశ్చలధ్యానస్థితిసాధించడం.నిరంతరం సాధనచేయగాకుదురేదిధ్యానస్థితి.స్మరణం,శ్రవణం,కీర్తనం,స్తోత్రం,ఏదయినా నియమంగాచేయగలిగితే ఎవరైనా విజయముహుర్తాన్నిదక్కించుకోవచ్చు.
“పాల జలనిధిలోని పసనైనమీగడ
మేలిమితామర లోని మించువాసనా
నీలవర్ణు వురముపై నిండినా నిధానమవై
ఏలేవులోకములు,మమ్మేలవమ్మా అని కీర్తించారు అన్నమాచార్యులవారు
“క్షీరాబ్ధికన్యకకు,శ్రీమహాలక్ష్మికి నిలువుమాణిక్యముల నీరాజనం ,” అన్నారు.
ఇంతచక్కగ కీర్తిస్తే శ్రీ మహాలక్ష్మి చిరునవ్వులు కురిపించదా,సిరులజల్లుకురిపించ కుండా వుండ గలదా.
